Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
గిరిజన ఆత్మగౌరవ దండోరాయాత్రలలో భాగంగా గురువారం మాజీ ఎమ్మెల్యే బాలునాయక్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ దళితబంధును రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శులు వేణుధర్రెడ్డి, సిరాజ్ ఖాన్, దళిత కాంగ్రెస్ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు యేకుల సురేష్, దేవరకొండ మండల అధ్యక్షులు అంకూరి శివ, పట్టణ అధ్యక్షుడు ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ జాలా నర్సింహారెడ్డి, కాంగ్రెస్ జాతీయ ఆదివాసీ కోఆర్డినేటర్ నేనావత్ కిషన్ నాయక్, ఎంపీటీసీలు జగన్, సుమలత, భాస్కర్, రాణి రాజు, రాష్ట్ర సర్పంచుల ఫోరం మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి పాల్గొన్నారు.