Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మునుగోడు
మండలంలోని చీకటి మామిడి గ్రామానికి చెందిన వీఆర్ఏ ఒగ్గు యాదయ్య భార్య రమణమ్మ అనారోగ్యానికి గురై శుక్రవారం మృతి చెందింది. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది వీఆర్ఏ కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి కుటుంబానికి రూ.10 వేలు, గ్రామ సర్పంచ్ తాటికొండ సంతోష్ సైదులు రూ.5 వేలు ఆర్ధిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ దొర విజయలక్ష్మి, గ్రామ ఉపసర్పంచ్ పొలగోని ప్రకాష్, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్రెడ్డి, ఏఆర్ఐ ప్రియాంక, వీఆర్వోలు చంద్రయ్య, జనార్ధన్, శ్రీశైలం, వెంకన్న, యాదయ్య, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాసులు, వీఆర్ఏలు లింగస్వామి, వెంకటయ్య, నీలేష్, దాను సూర్య, నర్సింహా పాల్గొన్నారు.