Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జూనియర్ సివిల్ జడ్జి పురుషోత్తంరావు
నవతెలంగాణ - తిరుమలగిరిసాగర్
ప్రజలకు చట్టాలపై అవగా హన కల్పించడానికి న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్న ట్టు నిడమనూర్ జూనియర్ సివిల్ జడ్జి పురుషోత్తంరావు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో 'జాతీయ న్యాయ సేవా దినోత్సవం' సందర్భంగా నిర్వహించిన న్యాయ విజ్ఞాన సద స్సులో ఆయన మాట్లాడారు. చట్టం ముందు అందరూ సమానులేనన్నారు. కోర్టులో కేసులపై కొట్లాడలేని వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సుధాకర్, ఎంఈవో తరిరాములు, న్యాయవాదులు రఘురాం, రాజు, విజేందర్రావు, సుధాకర్, లలిత తదితరులు పాల్గొన్నారు.