Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ప్రజల నుంచి పలు సమస్యలపై అందిన అర్జీలను ప్రాధాన్యతనిచ్చి త్వరితగతిన పరిష్కరిం చాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ధరణీ, భూ సంబంధిత సమస్యల పరిష్కారం, పింఛన్ల్ల పంపిణీ సంబంధిత 82 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకే సమస్యకు సంబంధించి పలు దఫాలుగా అర్జీదారులు తిప్పించుకోవద్దన్నారు. తక్షణమే సమస్యను అర్థం చేసుకొని పరిష్కారం చూపాలన్నారు. తీసుకున్న చర్యల పై అధికారులకు లిఖిత పూర్వకంగా తెలియజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్జీదారుల నుంచి అందిన సమస్యల విషయంలో అధికారులను వివరాలు అడిగి తెలుసుకొని, పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ విజయ కుమారి, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాగేశ్వర చారి పాల్గొన్నారు.