Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణసంస్కృతీతీ సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అని మున్సిపల్చైర్మెన్ తిరునగర్ భార్గవ్ తెలిపారు.కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నేతన్నలకు ప్రభుత్వం చేయూతనందించి ఆదుకుందన్నారు.మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురం, ప్రకాష్ నగర్, షాబు నగర్, ఇస్లాంపుర, గాంధీ నగర్ కాలనీల్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తిరునగర్ భార్గవ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మెన్ తిరునగర్ నాగలక్ష్మీ భార్గవ్, వైస్చైర్మెన్ కుర్ర విష్ణు, ఇన్చార్జి కమిషనర్ సాయిలక్ష్మి, స్థానిక కౌన్సిలర్లు సలీం, చిదళ్ళ వెంకటేశ్వర్లు, ఉబ్బపల్లి మధు, కమిళి బీమ్లానాయక్, ఐల వెంకన్న, జానిపాషా, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్గౌడ్, మగ్దూమ్ పాషా పాల్గొన్నారు.