Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీఐజీ రంగనాథ్
నవతెలంగాణ -నల్లగొండ
విజయదశమి పండుగ జిల్లా ప్రజలకు అన్ని రంగాల్లోనూ విజయం చేకూర్చాలని, జిల్లా అన్ని రంగాల్లోనూ అగ్రభాగంలో ఉండాలని కోరుతూ డీఐజీ ఏవి.రంగనాథ్ ఆకాంక్షించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో డిఐజీ తన సతీమణి లావణ్య రంగనాథ్ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు చేశారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలన్నారు. అనంతరం ఎంటి విభాగం వద్ద వాహనాల పూజ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.పూజా కార్యక్రమాలలో డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరి, అదనపు ఎస్పీనర్మద, ఏఆర్ డీఎస్పీ సురేష్ కుమార్, రిజర్వ్ ఇన్స్ పెక్టర్లు నర్సింహా చారి, శ్రీనివాస్, సిబ్బంది జలీల్, లియాఖత్, లాజర్, ఖాసీం డ్రైవర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.