Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోత్కూర్
మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కవి దేవినేని అరవిందరాయుడు రచించిన ''నానీ విహంగాలు'' లకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు దక్కాయి. అరవిందరాయుడు రచించిన ''నానీ విహంగాలు'' కవితా సంపుటిని చదివిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుస్తకంలోని నానీలు చదువుతుంటే ప్రతి వాక్యం రసాత్మక కావ్యం అనే సూక్తిని అనుసరించి స్ఫూర్తిని కలిగించే విధంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసలు పొందిన దేవినేని అరవిందరాయుడును పలువురు అభినందించారు.