Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చందంపేట
మండలంలోని నెరుట్లతండాలో నేడు బంజారా సాంస్కతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు యాదగిరిగుట్ట ఉప స్థపతి డాక్టర్.జాటావత్ మోతీలాల్నాయక్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బంజారా రాష్ట్ర నాయకులు. బంజారా అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.బంజారాజాతి సంప్రదాయలను మర్చిపోకుండా అవగాహనతో పాటు జాతి గొప్పతనాన్ని బంజారా మేధావులతో చర్చించి జాతి పూర్వ జీవనం గురించి పూర్తిగా వివరించే దిశగా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.