Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూనియర్ సివిల్ జడ్జి సంకేత మిత్ర
నవతెలంగాణ - హుజూర్నగర్
సత్వర న్యాయ సేవలు అందించడానికి న్యాయవాదుల సహకారం ఎంతో అవసరమని జూనియర్ సివిల్ జడ్జి సంకేత మిత్ర అన్నారు. సోమవారం ఆయన న్యాయమూర్తిగా బాధ్య తలు స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి న్యాయవాదుల సహకారం ఎంతో అవసరమన్నారు. సీనియర్ సివిల్ జడ్జి నరసింహమూర్తి మాట్లాడుతూ న్యాయవాద పీఠానికి న్యాయవాదుల మధ్య మంచి సంబంధం కొనసాగాలని సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రెడ్డి మాట్లాడుతూ న్యాయస్థానంలో సుమారు ఏడు వేల కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సత్యనారాయణ, బార్ అసోసియేషన్ కార్యదర్శి జక్కుల నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, వీజీకే మూర్తి, బాలకృష్ణ, అంజయ్య, అంబటి శ్రీనివాస్రెడ్డి, సీహెచ్.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.