Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
మండలంలతోని నాయకునితండా గ్రామానికి చెందిన మెరావత్ గుండు(35) తనకున్న వ్యవసాయపొలంతో పాటు మరో మూడెకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు.ఇటీవల కురిసిన వర్షాలకు పంటంతా జాలు పట్టింది.దీంతో ఆశించిన మేరకు దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపం చెందాడు.ఈ క్రమంలో ఈ నెల 14న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.విషయం గమనించిన కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.సోమవారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు.మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.మృతుని భార్య ఫిర్యాదు మేరకు ప్రొహిబిషన్ ఎస్సై డి.సాయికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.