Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- భువనగిరిరూరల్
భువనగిరి మాజీ ఎంపీపీ తోటకూర వెంకటేష్ యాదవ్ తండ్రి తోటకూర బాలక్రిష్ణ యాదవ్ ఇటీవల మృతిచెందాడు. సోమవారం ఆయన కుటుంబ సభ్యులను గొర్రెల మేకల పెంపకం దారుల సహకార ఫెడరేషన్ చైర్మెన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పరామర్శించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో గొల్ల కుర్మ జేఏసీ కన్వీనర్ అయోధ్య యాదవ్, నాయకులు గుండ్లపల్లి సతీష్ యాదవ్, తదితరులు ఉన్నారు.